About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 26 April 2013

నా పై కురిసే నల్లటి మేఘం




తల పై చేయి పెట్టుకుని పడుకుని వుంటాను 

నా లోంచి ,లోలోంచి ఒక నల్లని మేఘం 
పుడుతుంది 
నా పైనంతా పరుచుకుని నవ్వుతుంది 
నేను లేచి కూర్చుంటాను 
అతనోస్తాడు 
యేవో లెక్కలు కడతాడు 
ఒక గొడుగిస్తాడు 
అప్పుడిక నేను నవ్వుతాను 
చీకటి చెట్టు వెనుక నిండు చంద్రుడ్ని చూసి 
మరేమీ అనుకోను 
అప్పడం లాగున్నావు చంద్రుడూ అంటాను 
వట్టి మసాలా అప్పడం! 
కానీ ఒకరోజు ఏదో అవుతుంది 
మెదడులోనూ ,మనసులోనూ 
చెప్పిన  మాట విననిదేదో పుడుతుంది 
నా కళ్ళ ఎదుటే నీళ్ళు తగిలి ఉబ్బిపోయే 
అదేదో పదార్థం లా 
ఇంతది ,అంతవుతుంది . 
ఇప్పుడు కూడా చూస్తూనే వుంటాను 
ఆ నల్ల మేఘం మళ్ళీ పుడుతుంది 
నా పైనంతా పరుచుకుంటుంది . 
అతను పరిగెట్టుకొస్తాడు 
లెక్కలేస్తాడు 
చిన్నపోతాడు . 
నేను నవ్వుతాను 
తడవడం నాకు వ్యసనమేమో
నువ్వేం చేయగలవని  నేనతనితో అనను 
దయతో  జాలిపడతాను . 
అతనీసారి మరీ మందమైన గట్టి గొడుగునిస్తాడు 
శుభాన్ని కాంక్షించి సెలవు పుచ్చుకుంటాడు 
అతనటు వెళ్ళగానే నేను నవ్వుకుంటాను .విరగబడీ ,పగలబడీ . 
నవ్వి నవ్వి ఏడుపొస్తుంది . 
అప్పటికే నా నల్ల మేఘం నన్ను కావిలించుకుని వుంటుంది 
నువ్వంటే నాకిష్టం లేదు అంటాను . 
ముడుచుకుంటాను ,
నన్ను వదిలి పెట్టూ అంటాను 
నల్ల మేఘం ,నా నల్ల మేఘం 
నాలో జీవసారాన్ని నమిలి మింగిన నల్ల మేఘం 
నన్ను తడుపుతూ వుంటుంది 
కాంక్షగా .... 
కసిగా !!!



Tuesday 23 April 2013

చిన్మయి

ఇవాళ పొద్దున్న ఈ పాట విన్నాను . స్నేహితురాలు చిన్మయి గురించిన ప్రస్తావనతెస్తే . పాట బాగా నచ్చింది . ఈ మూవీ తమిల్ వర్షన్ లో పెయిర్ ఇష్టం నాకు . తెలుగు ''ఏ మాయ చేసావో'' హైదరాబాద్లో చూస్తూ వుండగా నా తల బద్దలై అగ్ని పర్వతమవుతుండగా మొత్తం కనుక చూసానంటే మరిక మిగలనేమో అనిపించి క్రిందికొచ్చి వాష్ రూం లో వాంతులు చేస్తూ వుండగా పక్కనే అలాటి సౌండ్ వచ్చి చూస్తే ,నా లాగే ఇంకో పిల్ల ...ఆ పిల్ల తల్లి మా ఇద్దరినీ జాలిగా చూస్తూ .నాకెందుకో అది నా సొంత తల నెప్పిగా కాక సినిమా ఎఫెక్ట్ గా గుర్తుండి  పోయింది .కానీ తమిల్ మూవీ బాగుంటుంది .

దేవస్మిత కథ గురించి కామెంట్స్ చదువుతున్నపుడు కూడా ఈ మూవీ గుర్తొచ్చింది .ప్రస్తావించాలని కూడా అనిపించిన్ది.  ఈ కథా నాయిక అంటే దేవస్మిత మీద ఉన్నంత చిరాకు నాకు .

ఇంతకు ముందు ఈ పాట ఏ మూడ్ లో విన్నానో  కానీ ఇంత సుందరంగా తోచలెదు. బహుశా ఇవాళ చిన్మయీ అందమైన ఫోటో చూట్టం వల్ల కావచ్చు పాట కూడా బహు శ్రావ్యంగా అనిపించింది .











Friday 12 April 2013

ఒక కథ !

గ్రాడ్యుయేషన్ వరకూ నేను చాల శ్రద్దగా పేపర్లు,ఇండియా టుడే రాజకీయాలూ చదివెదాన్ని. సంపాదకీయాలూ , సాహిత్య పేజీలు  చాలా ఇష్టంగా దాచుకునే దాన్ని . సెంట్రల్ యునివర్సిటీ కి వచ్చాక నా అధ్యయనానికి బ్రేక్ పడిన్ది. మా యునివర్సిటీ పేపర్ రూమ్లో మగ వాళ్ళు , నల్లులు ఎక్కువగా వుండే వారు[వి] . అదే కాక అన్ని పుస్తకాలు ఒక్క సారిగా చూసే సరిక నా మోజు సాహిత్యం వైపుకి వెళ్లింది . ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అధ్యయనం మొదలెట్టాను మార్క్సిజమ్,అంబేడ్కరిజం లో ఎక్సెల్ అవ్వాలని కోరిక పటుకుంది .కేవలమ్ నా సంతృప్తి కొసమె కాదు సామాన్యకిరణ్ ఫౌండేషన్  నుంచి భవిష్యత్ లో మంచి పుస్తకాలు రావాలి అందుకు .

ఈ అధ్యయనం లో భాగంగా ఇవాళ ఇది చదివాను . చాలా బాధ కలిగింది . నవయాన్ పబ్లిషర్ యెస్.ఆనంద్ చెప్పిన నమ్మక తప్పని అనుభవం జ్ఞాపకం వచ్చింది http://india.ashoka.org/fellow/s-anand Anand’s own life serves as an example. Born into a traditional Brahmin family in Tamil Nadu, at the top of the hierarchy, he confesses to being a student of only average effort and capability. Yet his teachers—many of them Brahmins—always
His marriage to a fellow student outside his caste further brought home to him the tyranny of the system. Now largely alienated from his family, Anand narrates an interesting story from his university days. His girlfriend, a non-Brahmin, once told him that he scored higher marks more easily only because he was Brahmin. Proof of this came through an unintended experiment. Anand had once written a term paper for his MA English course on behalf of his girlfriend (whom he later married). He also wrote another paper, a poorer one, in his own name. However, when the assessments came in, he had scored higher than her. This reinforced the social truth that Anand’s caste mattered more than the merit of his non-Brahmin girlfriend’s efforts.


ULTURE & SOCIETYLife

PERSONAL HISTORIES
‘EVEN IF I NEVER BECOME A DOCTOR, I WILL NOT GIVE UP THIS FIGHT’

AJAY KUMAR SINGH
Born in 1982. Grew up in Etah in Uttar Pradesh. Gained admission in 2002 at the All India Institute of Medical Sciences. Is in his MBBS final year

I was in Class viii when I first heard about AIIMS, the All India Institute of Medical Sciences. My mother was a nurse, and the doctor she worked with in Etah, my hometown, had a nephew at AIIMS. He visited Etah once, and my mother was very keen that I meet him. “You need to read a lot if you want to go to AIIMS,” he said. That’s when I told myself I’d study there somehow, someday.
Uzma Mohsin
The harassment peaked during the anti-reservation protests of 2006. They were always trying to start fights so they could bash us up. Derogatory remarks were common: ‘Yeh chamar log kya karenge?’
My father, who drives an autorickshaw, wouldn’t have been able to send me to Delhi for coaching had it not been for my Physics teacher who helped me get a concession on the fees. I got into AIIMS with 66.16 percent, the same as the “General” cut-off that year. Nirpat Singh, the autodriver, and Munni Devi , the nurse, were very proud of their son. It was a big moment for all of us when we entered the campus of India’s premier medical sciences college.
As soon as my parents left, I was summoned by my neighbour, a senior, who asked me to introduce myself. Among other things, I told him I had stood first on the Scheduled Caste list. The next moment I found myself outside the room, on the ground; he had pushed me out. That was just the first day. The next time he tried to insult me, I told him I’d complain. While he never spoke to me as long as he was on campus, he told his friends about the incident and they boycotted me too.
Ever since, I have been reminded of my “low” status every moment I have been here. I was the only “Category” student in my wing. One day, I found this on my door: “Nobody likes you here. F**k off.” On another day: “Everybody can use the carom board, but not Room No 45.” People would bang and kick at my door at all hours, disappearing by the time I opened it. They tried their best to make me leave, but I told myself I wouldn’t, no matter what. I gradually isolated myself from them, and started interacting only with others from the “Category”.
I had been to school at the Navodaya Vidyalaya for seven years, and I knew about casteism from my experience there, but it was nothing compared to AIIMS. In school, I used to think I wouldn’t have to go through the same humiliations if I were at a big institution. I came to the biggest of them all, but in vain. At least we would eat together at Navodaya.
It is true that not all General Category students are casteist, but caste cuts through everything at AIIMS. They won’t talk to us. We have no representation in the students’ union this year. They won’t let us play cricket; in a basket ball match, they won’t pass us the ball once. The hatred was out in the open in 2003, during Pulse (AIIMS’ annual medical college festival). They beat up a Dalit student so badly that it was a miracle he survived. We went to complain, but the administration was ready only to dismiss both parties: those who attacked and those who were attacked. Having been beaten up, he didn’t want to go through that, so he withdrew.
The harassment reached a high during the anti-reservation protests of 2006. There were more than a thousand outsiders staying on campus during those days. They slept in our hostels and ate in our messes. Derogatory remarks were common: “Yeh chamar log kya karenge?” They were always trying to start fights so they could bash us up. They even made plans to beat up a few resident doctors. There was no point complaining. Nobody was willing to listen. The media chose to portray last year’s events as if everyone at AIIMS — scs, sts and obcs included — was against reservation. “Category” juniors were dragged out during ragging and forced to participate in the protests; in many of these, they came under baton charges from the police. I could see them going through trauma; I took the initiative and told the director that ragging was being prolonged even after the stipulated time. Nothing happened. They also beat up our gym secretary, a “Category” student. That got all of us very upset. Pushed to the wall, we decided to submit a memorandum. The director, Dr P. Venugopal, promised to act within 24 hours — and he did. All the people we named were informed, and all of them came to each one of us and threatened us with dire consequences if we did not withdraw the complaint. We didn’t; instead we wrote another, this time to the President of AIIMS. There was no response. Then we went to the media.
We were accused of obstructing Pulse 2006. They did that to malign us and turn student sentiment against us. We put up posters clarifying our stand — we had nothing against Pulse, we just wanted the harassment stopped. During Pulse, a cd was circulated with a film showing the burning of books written by Babasaheb Ambedkar. I called a press conference against the film; I didn’t get much support. An enquiry committee was appointed, and they asked me why I was out to tarnish AIIMS’ reputation. I told them I had no choice when no help was forthcoming.
Never before had a “Category” student raised his voice this way.
They decided to teach me a lesson, and send out a message to all the “Category” students of the campus. They failed me in my final professional exam, which was in December. If I fail three times, I will be disqualified. My re-examination was video-recorded — though it is unheard-of, I wouldn’t have had any problem had they informed me beforehand. I wrote another complaint to the director about this illegal recording. A day before the results were due, my result was leaked. Posters were pasted all over campus declaring that the student who had complained and called the press conference had failed. I filed a police complaint. We held a series of protests, as a result of which the Centre formed a committee headed by the University Grants Commission chairman Sukhdeo Thorat, to look into the matter. The AIIMS director did not even allocate it a room, and the hearings happened off-campus. I gathered everyone and we went to depose in groups.
I knew I would fail when the only question I was asked on my viva was: “What is your involvement with the Thorat report?” Six or seven students had scored lower in the internal marks than I — all passed, I did not. I was failed in medicine in my re-professional exam by one-and-a-half marks. We later got to know that the faculty association had passed a resolution two days before the vivas that no one would take my re-examination viva. And the director still hasn’t accepted the governing body’s order to grant me re-examination with a new set of examiners.
All this is being done to scare my juniors. My case will be an example, since I am in my final year.
I had an opportunity recently for an internship at the University of Penn-sylvania. AIIMS couldn’t do anything about it, so they got in touch with their seniors there, who, as I have heard, assured them they would “set me right”.
If I am not destined to be a doctor, I won’t be. But I will not give up this fight. Even if I never become a doctor, I have a great satisfaction already. No voices were heard in the past. Now people are willing to come to protest. There are 45 “Category” boys at AIIMS, and whenever there is a protest, at least 40 of them turn up.
Though my father is an auto driver, people respect him in my hometown. My parents have taught me to safeguard my dignity at all costs, and that’s what I am doing now. Though it was not easy, I don’t feel it has been all that tough either.
As told to Praveen Donthi
Jun 02 , 2007

Thursday 11 April 2013

మనమెందుకిలా లేము ?





ఒక పురుషుడు:

 కవిత సర్కార్ ,ఆమె భర్త బంగ్లాదేశ్ నివాసులు .పెల్లై రెండేల్లేమో అయింది . పెళ్ళప్పుడు అనిపించలేదేమో కానీ తరువాత ఆమె నల్లగా వుందని భర్తకి నచ్చకుండా వచ్చింది . వేరే స్త్రీ తో సంబంధం ఏర్పడింది . అతని మనసు మారినట్లు కవిత మనసు మారలేదు ఘర్షనలు జరిగాయి .కొన్నిరొజుల క్రితం హటాత్ గా భర్త చాలా మంచి వాడై  పోయి పద భారత్ లో బంధువులింటికి వేల్లెసోద్దామని చెప్పి అక్రమం గా భారత్ లో కి మేముంటున్న మాల్దా కి తీసుక వచ్చాడు .

పక్కనే ఉంటున్న వేరే ఊరికి తీసికెళ్ళి ఆమెని అమ్మకానికి పెట్టాడు . భర్త పదివేలు అడిగితే పిల్ల నల్లగా వుందని చెప్పి ఎనిమిదే ఇస్తామన్నారట .బేరమ్ కుదరలేదు . విసుగొచ్చింది . ఆ కోపంతో భార్యతో ఘర్షించి  ఆమెని  నిర్జనం గా వున్న మామిడి తోపుకి తీసికెళ్ళి చచ్చేట్టు కొట్టి తన జేబులో వున్న పెన్నుతో ఆమె రెండుకళ్ళూ పీకేసాడు .కవిత షాక్ కి గురై అపస్మారకం లోకి వెళ్ళడం వల్ల విపరీత రక్తస్రావం జరిగింది . ఆమె పరిస్థితి రానున్న 72 గంటలలోపు ఏమీ చెప్పలేమట . ఒక వేళ బ్రతికినా కళ్ళు ఇక పూర్తిగా రావట .

ఒక స్త్రీ :

మీరా సూత్రదార్ మా ఇంట్లో డస్టింగ్ పని చేస్తుంది . దాదాపు నాలుగేళ్ల క్రితం విపరీత తాగుబోతు అయిన ఆమె భర్తకు పిచ్చి వచ్చింది . అంత పిచ్చిలో కూడా అతనికి భార్య మాత్రమె లోకువ .ఇక ఎవరి మీదా కోపం వుండదు . పిచ్చి వచ్చినపుడు భార్యని విచక్షణా రహితంగాకొడతాడు . ఆమె చీరలు చించి వేస్తాడు . ఒక సారి కూరలు తరిగే కత్తి పీట తీసుకుని ఆమె భుజాన్నినరికాడు . విని విని ,,మీరా నువ్వు తిరిగి కొట్టొచ్చు కదా ?ఏం నీకు బలం సరిపోదా ?అంటే మీరా అన్నది .''యెట్లా కోడతాము బాగున్నపుడు ఎంత ప్రేమగా వుండే వాడు , అదంతా మరిచిపోయేదా ?అన్నది . మరి బాగున్నపుడు నిన్నుఎప్పుడూ  కొట్టేవాడు కాదా అంటే ,ఎందుకు కొట్టే వాడు కాదు ... అప్పుడప్పుడూ కొట్టేవాడే అన్నది.

మనమెందుకిలా లేము ?

ఇదనె కాదు చాలా సార్లు నాకనిపిస్తూ వుంటుంది ,మనమెందుకిలా లేము అని !మన సృష్టిలోనే ఏదో తేడా వుంది . ఎంత మంది స్త్రీలు ఎంత మంది పురుషుల్ని ఈ ప్రపంచంలో హత్య చెసారు. మనమేం చేస్తాం కోపమొస్తే ఏడుస్తాం .త లనొప్పులు తేచుకుంటాం .దేవుడికి ముడుపులు కట్టుకుంటాం . భర్త వలన పిల్లలు పుట్టకపోతే ఇంకో భర్తని తెచ్చేసుకోం .నా ఖర్మ ఇంతేనని గొడ్రాళ్ళగా వుండి పోతాం . మనల్ని మనం బాధించుకుని మనల్ని మనం హత్యించుకుంటాం .

ఎందుకని మనం పురుషుల్లా లేము . ఏమో నాకు తెలీదు .వుండాలని నేననడం లేదు .కవిత  భర్తని అంత అమాయకంగా నమ్మి ఎలా ఇంత దూరం వచ్చింది ?మీరా ఆత్మ సంరక్షణకు భర్తను ఒక వేటేస్తేనేం ?

ఏంటో ఈరోజంతా ఒక చెడ్డ దిగులు తగులుకుంది . మాటి మాటికీ ఏడుపొస్తుంది . పాపాయి కూడా చాలా భయ పడింది .వుమెన్ షుడ్  కిల్ మెన్ ఘోస్ట్ అన్నది .ఆడవాల్లు ఈ మగ పిశాచుల్ని చమ్పెయ్యాలట . మగ వాళ్ళు పిశాచులట .

ముగింపు :

కవిత మొగుడు చివరికి కొన్ని గంటల్లోనే పట్టు పడి పోయాడు . మన పోలీసు వ్యవస్థ ప్రపంచం లోనే అత్యంత సమర్ధవంతమైనదట . తప్పు చేసిన వాళ్ళు పట్టు  పడక మానరు . మహా మహా పోలీసు అధికారి కొడుకు బిట్టూ మొహంతీ ఎన్ని వేషాలు మార్చినా పట్టు పడ్డాడు . బుద్ధి వున్న వాళ్ళెవరూ తప్పులు చేయరు. సంస్కార హీనులే ఇలా ప్రవర్తిస్తారు .

కొంత మంది సిస్టం ఒకటి ముందు పెట్టుకుని ఎన్నెన్నో ఆకృత్యాలు చేస్తుంటారు .వాటిల్ని అతి సులభంగా కని పెట్టగల సాఫ్ట్ వేర్లు పోలీసు ల దగ్గర ఇవాళ వున్నాయి . ఆ టెక్నాలజీ ప్రత్యక్షంగా చూసి నేను చాలా ఆశ్చర్య పడ్డాను . పిల్లుల్లా కళ్ళు మూసుకుని పాలు తాగుతూ మనల్ని ఎవరూ చూట్టం లేదని కవిత మొగుడిలా అనుకోవడం పొరపాటు .

అసూయ చెడ్డ లక్షణం . మారు పేర్లతో ఇతరుల మీద బురద చల్లుదాం అనుకుని పాటు పడటం  ,తను అనుకున్నట్లే ప్రపంచం ఉండాలనుకోవడం మానసిక రోగాలు.అటువంటివి  తలెత్తితే వెంటనే డాక్టర్ కి చూపించుకోవడం మంచిది .ఎందుకంటె తప్పులు ఎన్నో రోజులు దాగవు. ఎవరూ కూడా సరేనని ఊరుకోరు.  ప్రతి దానికీ ఒక ముగింపు వుంటుంది .





Tuesday 9 April 2013

ఫుట్ ప్రింట్స్

నిన్న నేను చెప్పిన ఫుట్ ప్రింట్స్ ఇదే ...

Monday 8 April 2013

దైవం మారునా ...!

ఈ పాటని మొదటి సారి ఆరో తరగతిలో అనుకుంటా విన్నాను . పాట మాధుర్యం కంటే ఇందులో వున్న సాహిత్యం నాకు ఎక్కువ ఇష్టం .ముఖ్యంగా ''ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే ...''లైన్స్ ఇష్టం.  ఆత్మ శాంతి అనేది చాలా పెద్ద మాట  అందు  బదులుగా ఆనందం అని చిన్న మాట వాడేసి వుంటే ఈ సరలళతకి ఇంకా అందం వచ్చేదేమో .

ఒక సారి హాస్టల్ లో వున్నపుడు ఒకమ్మాయి రూమ్లో ఒక పోస్టర్ చూసాను . యదాతదంగా   జ్ఞాపకం లేదు కానీ ఒకతని వెంట భగవంతుడు ఎప్పుడూ నడుస్తూ ఉంటాడు .దేవుని పాద ముద్రలు అతనికి కనిపిస్తూ వుంటాయి .ఒక సారి అతనికి గొప్ప కష్టం వస్తుంది . అప్పుడు దేవుని పద ముద్రలు కనిపించవు అతను  కినుకు పడి నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు లేవు అని అలుగుతాడు . అప్పుడు దేవుడు అంటాడు నువ్వు చూసింది నా అడుగుల గుర్తులు ఎందుకంటె నువ్వపుడు నా చేతుల్లో వున్నావు అని . నిజం కదా దైవమంటే యుక్తాయుక్త విచక్షణ కలిగి ,కష్టాలలో కూడా మంచిని విడిచి పెట్టని వ్యక్తే నని నా అభిప్రాయం . అలాటి మనుషులే కాలక్రమాన దైవాలవుతారు .
ఏ విధి మారినా వారు మారరు . 


                                    


నీ మది చల్లగా స్వామి నిదురపో 
దేవుని నీడలొ వేదన మరచిపో 
నీ మది చల్లగా ...

ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు 
ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే 
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే


చీకటి ముసిరినా వేకువ ఆగునా 

ఏ విధి మారినా దైవం మారునా 
కలిమిలోన లేమిలోన 
పరమాత్ముని తలచుకో 

జానకి సహనము రాముని సుగుణము 
ఏ యుగమైనను ఇలకే ఆదర్శము 
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము

నీ మది చల్లగా స్వామి నిదురపో 
దేవుని నీడలొ వేదన మరచిపో 
నీ మది చల్లగా ...

Thursday 4 April 2013

ఎంత బాగుంటుందో !

             లేక్ హౌస్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం . మేజిక్ రియలిజం లో  వుండి నా బుద్దికి గాఢమైన సంతృప్తిని ఇస్తుందీ  మూవీ    .పుష్పవర్ణ మాసం  గురించి అనుకున్నపుడు నా మిత్రులకి సామూహికంగా ''వాట్ డ్రీమ్స్ మే కమ్''   జ్ఞాపకానికి వచ్చింది కానీ ,నాకు మాత్రం ఎందుకనో లేక్ హౌస్ జ్ఞాపకానికి వస్తుంది . నాకు పిచ్చి ఇష్టమీ మూవీ . ఇందులో తటస్థ పడే నిక్ డ్రేక్ పింక్ మూన్ ,అతని గభీర కంటమూ కూడా .

ఏవిటో బోల్డు మార్మికతను దాచుకున్నట్లు వుండే రీవ్స్ ముఖమూ ,స్త్రీత్వం కొంతగానే కనిపించే శాండ్ర ఈ మూవీకి అందాన్ని తెచ్చి పెట్టారు .నిజానికీ వాల్లిద్దరీ సౌందర్యం నన్నెందుకో బాగా ఆకర్షిస్తుంది కూడా .   
                                                                                                               

Monday 1 April 2013

జిలుకర శ్రీనివాస్



ప్రాతినిధ్య ఆవిష్కరణకు నేను పిలిచిన వక్తలలో జిలుకర శ్రీనివాస్ ఒకరు .శ్రీనివాస్ నా  జూనియర్ . శ్రీనివాస్ ప్రకారం నాకు రాజకీయాలుతెలియవు[అతను చెప్పే రాజకీయాలు అర్థం కాకపోతే ఇక ఏమీ తెలీదనే ...]  .నేను చాలా అమాయకురాలిని  .కేవలం హృదయ వాదిని . అతను చెప్పింది నిజమే అయితే బహుశా అది లొపమేమో . ఆ లోపం నా పుట్టుక రీత్యా వచ్చి పడింది .

పాణి గారి అస్తిత్వం -ఆధునికత- మార్క్సిజం  చదివిన తరువాత అస్తిత్వాల పట్ల ఆ పుస్తకంలో నాకో భావజాల ఐక్యత కనిపించింది. అందుకని నేను పాణి గారిని వక్తగా పిలిచాను .పాణి  గారి ప్రతి మాటా శ్రీనివాస్  ని ఇరిటేట్ చేసింది.  ఆ అసహనాన్ని నా మీద కూడా వేదిక మీదే చూపించాడు శ్రీనివాస్ . అవతలి మనిషిలో వున్న టాలరెన్స్ శ్రీనివాస్ లో లేకపోయిందనిపించినా,అతని  అసహనంలో న్యాయముంది .ఆ అసహనం శతాబ్దాల సహనత్వం  నుండి వచ్చిన తిరుగుబాటు .  నిజానికి శ్రీనివాస్ రాజకీయాలపట్ల అంగీకారం వున్నా సంపూర్ణ అంగీకారం లేకపోవడం  ... నా అసహాయత .[ఇక్కడేం పదం వాడాలో నాకు తెలీదు ] .

శ్రీనివాస్ హృదయం లో విపరీత ఘర్షణ నెలకొంటే తప్ప ఏదీ రాయడని నాకు తెలుసు.  అందుకే ఇవాళ పొద్దునే శ్రీనివాస్ వ్యాసం వచ్చిందని కిరణ్ చెప్పగానే చదవక ముందే ఇది ఆ వేదిక మీద పుట్టిందేనని నాకు అర్థమయిపోయింది . కాల్ చేసి క్లారిఫై చేసుకున్నాను . నాకు పాటం చెప్పటానికి ఒక కాల్ చేస్తే సరిపోయేదే కానీ శ్రీనివాస్ సందర్భం వచ్చింది కనుక నా బోంట్లకు కూడా కలిపి పాటం చెప్పేసాడు .

వ్యాసం చాలా బాగుంది .చదవాలి తప్పక . రంగనాయకమ్మ ఒకటో తరగతి వాళ్లకి కూడా సిద్దాంతం అర్థమవ్వాలని రాస్తే ,శ్రీనివాస్ పీ హెచ్ డీ వాళ్లకి కూడా వ్యాసం  అర్థం కాకుండా రాస్తాడు . అందుకు  కారణం ఆ అబ్బాయి ని వత్తిడి పెట్టె భావజాల  ఘర్షణ  .వ్యాసమ్ రాయాలనుకోవడం కంటే తన వేదనను వెళ్ళకక్కడమే ప్రధానం గా భావిస్తాడు . కనుక వ్యాసం తుదీ మొదలూ తెలుసుకోవడానికి మనం జ్ఞానులమై వుండాలి . ఎంత విభేదించినా ఈ విషయం లో మాత్రం శ్రీనివాస్ మార్క్సిస్టుల అడుగుజాడల్లో వెళ్తాడు .ఇది విమర్శ కాదు పొగడ్తె .

                                                       నా కాలపు మేధావి జిలుకర శ్రీనివాస్ .




           మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు
                                                  - డా.జిలుకర శ్రీనివాస్

ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులూ ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

సాహిత్యంలో వాస్తవికత ఒక తిట్టుపదంగా మారిపోయింది. వాస్తవికత ఒక నిర్మాణం. గోపాలకృష్ణమ శెట్టి, కందుకూరి, గురజాడలు బ్రాహ్మణీయ వాస్తవికతను నిర్మాణం చేశారు. అయితే, బ్రాహ్మణీయ వాస్తవికత నికరంగా నిలబడకుండానే పలాయనవాదంలోకి జారుకుంది. అదే కాల్పనికవాదం. భావ కవిత్వం దానిలో ఒక పాయ. కుల వాస్తవికతను సైద్ధాంతిక, రాజకీయ క్షేత్రంలో కింది కులాలు వ్యక్తీకరించడమే కాదు దాని తార్కికతనూ నిర్ణాయకవాదాన్నీ ప్రశ్నిస్తున్న 'కాలం'లో తెలుగు సాంస్కృతిక 'స్థలం' బ్రాహ్మణీకపు కాల్పనికవాదంలోకి సచేతనంగానే పాదం మోపింది. అదే నడక అభ్యుదయ, విప్లవ రంగాలను కూడా నియంత్రించింది. దానికి మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పునాది. అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు మార్క్సు ప్రతిపాదించిన భౌతికవాదం పునాది. లెనిన్ మార్క్సు జ్ఞాన సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దానికి శాస్త్రీయతను చేకూర్చాడు. లెనిన్ ప్రతిపాదించిన 'పరావర్తన సిద్ధాంతం' (రిఫ్లెక్సివ్ థీయరీ) ప్రపంచ వ్యాప్తంగా జ్ఞాన సిద్ధాంతాలను విశేషంగా ప్రభావితం చేసింది. సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ రచయితలు పరావర్తన సిద్ధాంతాన్ని బలంగానే ప్రచారం చేశారు. మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతానికి పరావర్తన సిద్ధాంతమే పునాది. ఈ సిద్ధాంతం నిజంగా అద్భుతమైంది. కాని, ఈ సిద్ధాంత స్ఫూర్తిని ఇక్కడి బ్రాహ్మణవాద రచయితలు గ్రహించలేదని విమర్శకుల భావన.

త్రిపురనేని మధుసూదనరావు 'సాహిత్యంలో వస్తు శిల్పాలు' అనే గ్రంథంలో 'పరావర్తన సిద్ధాంతం - సాహిత్యం' అనే ఉపశీర్షిక కింద పరావర్తన సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించారు. "...ఇంద్రియ జ్ఞానాలకి ఆలోచనలకీ మూలాధారం ఏమిటి? అంటే చైతన్యానికి మనస్సుకీ సంబంధం ఏమిటి? పదార్థం ముందు, దాని నుంచీ చైతన్యం ఉత్పన్నం అవుతుంది అని చెప్పుకోవటం మాత్ర మే చాలదు. మనిషికి ఇంద్రియ జ్ఞానాలూ, ఆలోచనలూ, ఆవేశం వంటివి ఎలా వస్తాయి అనేది భౌతికవాద జ్ఞాన సిద్ధాంత మౌలిక ప్రశ్న. దీనికే లెనిన్ పరావర్తన సిద్ధాంతం సమాధానం చెపుతుంది'' అని తెలిపారు. మనిషి మనస్సు నుండే జ్ఞానం పుడుతుందని భావవాదులు తలుస్తారనీ, భౌతికవాదులు ఇంద్రియ జ్ఞానం వికసిస్తుందని చెపుతారని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన సముపార్జనా క్రమంలో ఇంద్రియాల ద్వారా సమాచార గ్రహణం తొలి దశ. ఇంద్రియాలు లేకుండా మెదడుకు సమాచారం అందే వీలు లేదు. మెదడూ, ప్రపంచం రెండూ పదార్థ రూపాలే అంటాడు త్రిపురనేని. ఈ రెండింటి మధ్య వుండే సృజనాత్మకమైన, క్రియాశీలమైన సంబంధాన్ని పరావర్తన సిద్ధాంతం అంటారని ఆయన భావన.

"అద్దంలో చూసుకున్నప్పుడు మొఖం బింబం. అద్ధంలో కనిపించే మొఖం ప్రతిబింబం. బింబం లేకుండా ప్రతిబింబం ఉండదు. అలాగే మెదడు అద్దం అయితే అందులో ప్రతిబింబించేది బాహ్యప్రపంచం. ఈ బింబ ప్రతిబింబ ఉదాహరణ చాలా ప్రాథమికమైన పోలికగా మాత్రమే గ్రహించాలి. ప్రతిబింబానికి పరావర్తనకీ చాలా తేడా వుంది. అద్దంలో ప్రతిబింబానికి బింబానికీ మధ్య క్రియాశీలమైన, సృజనాత్మకమైన పరావర్తనా శీలమైన సంబంధం ఉండదు. మెదడు కేవలం అద్దం కాదు. అదొక జీవ శారీరక వ్యవస్థ. నిర్ధిష్ట క్రియలను నిర్వహించే అనేక సూక్ష్మ భాగాల అవిభాజ్య సముదాయం. కాబట్టి బాహ్య ప్రపంచం జ్ఞానానికి మూలం. ఇంద్రియాలు జ్ఞానానికి సాధనాలూ, వాహికలూ మాత్రమే కానీ ఇంద్రియాలే జ్ఞానానికి మూలం కాదు. బాహ్య ప్రపంచం ఇంద్రియాల ద్వారా మెదడులో పరావర్తనం చెందకుండా జ్ఞానం అనేది ఉండదు'' అంటారు త్రిపురనేని మధుసూదనరావు. మార్క్సు పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించడానికీ, ఉత్పత్తి విధానాన్ని సూత్రీకరించడానికీ కూడా పరావర్తన సిద్ధాంతమే మూలమని త్రిపురనేని భావన. పంటని ఉత్పత్తి చేసేందుకు భూమి, నీళ్లు, నాగలి, ఎద్దులు, ఎరువులు వంటివన్నీ అవసరమనీ, అవన్నీ బాహ్య ప్రపంచంలో దొరికేవనీ, అవి మనిషి చైతన్యంతో సంబంధం లేకుండానే ప్రపంచంలో ఉంటాయనీ, కానీ, వాటిని సృజనాత్మకంగా పరావర్తనం చేసుకోవటం వల్లే రైతులు పంటలు పండిస్తున్నారనే ఉదాహరణ సరిపోతుందని ఆయన అన్నాడు. మానవ చేతన కేవలం వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించటమే కాదు, దాన్ని పునర్ సృష్టిస్తుంది కూడా అని లెనిన్ తన వృద్ధాప్యంలో రాసుకున్న నోట్సులో పేర్కొన్నాడు.

అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న బాహ్య ప్రపంచాన్ని మానవుడు తనకు అవసరమైన విధంగా నిర్మాణం చేసుకుంటాడని దీని అర్థం. ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని బట్టీ, చారిత్రక పరిమితుల్ని బట్టీ అది నిర్ణయించబడుతుందని కూడా త్రిపురనేని పేర్కొన్నారు. ఈ మొత్తం సిద్ధాంతంలో 'బాహ్య ప్రపంచం', 'వస్తుగత ప్రపం చం', 'ఇంద్రియ చర్య' అనేవి చాలా కీలకం. బాహ్య ప్రపంచం అంటే కేవలం భౌతిక వస్తు సముదాయం మాత్రమే కాదు. ఆ వస్తు సముదాయాన్ని నియంత్రించే లేదా ఉత్పత్తి చేసే లేదా ప్రకృతిలో అంతర్భాగంగా జీవించే మానవ సముదాయం కూడా. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు కూడా బాహ్య ప్రపంచం అనే భావనలో అంతర్భాగం. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి విధానంతో పాటు మారుతాయనేది మార్క్సిస్టు అవగాహన. కాని కులం అనేది ఒక సంబంధం. ఆయా కులాలకు వ్యవస్థలో నిర్దేశిత స్థానం అనుసరించే అనులోమ, విలోమ సంబంధాలు ఉంటాయి. ఇవి వందల యేళ్లుగా ఉత్పత్తిలో గుణాత్మకమైన మార్పు వచ్చిన తర్వాత కూడా మారకుండా కొనసాగుతూ వున్నాయి. ఇండియా సమాజంలోని మానవ సంబంధాలు కుల సంబంధాలుగా వున్నాయనే సంగతిని ఇంద్రియాల ద్వారా మెదడుకు నిరంతరం చేరవేయబడుతూనే ఉంటుంది. ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులు కూడా ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

అదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానంతోటే వివిధ కులాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి అంతర్వును బట్టీ, స్థానం, స్థాయిని బట్టి ఆయా కులాల వ్యక్తుల మానసిక ప్రవర్తన ఉంటుంది. అది ఆ కులస్తుడి చైతన్యమై నిరంతరం అతని ప్రమేయ, ప్రవర్తనలను నిర్దేశిస్తుంది. ఇది వాస్తవిక దృశ్యం. ఈ వాస్తవిక దృశ్యం అనేక కుల నియమాల వల్ల నియతం అవుతూంటుంది. ఈ వాస్తవాన్ని మార్క్సిస్టు రచయితలు అంగీకరించలేదు. లెనిన్ వృద్ధాప్యంలో చెప్పిన మానవ చైతన్యం తిరిగి వాస్తవ ప్రపంచాన్ని సృష్టిస్తుందనే సూత్రీకరణను సారభూతంగా అర్థం చేసుకొంటే రచయితలు కుల సంబంధాలను, వాటిని నిర్ణయిస్తున్న భావజాలాన్ని సృజనాత్మకంగా చిత్రించేవారు. కానీ అలా చేయలేదు. అంటే బ్రాహ్మణవాద రచయితల చైతన్యం వాస్తవ ప్రపంచాన్ని పరావర్తనం చేయటం లేదనీ, కాల్పనికతను లేదా అబద్ధాన్ని నిర్మాణం చేస్తుందని అంగీకరించాలి.

పరావర్తన సిద్ధాంతం చారిత్రక భౌతికవాదంతో అంతస్సంబంధం కలిగి ఉంది. చారిత్రక భౌతికవాదం అనేది సమాజాన్ని అధ్యయనం చేసే విశ్లేషించే ఒక పద్ధతి. ఒక మెథడాలజీ. పాశ్చాత్య సమాజాన్ని విశ్లేషించినట్టే కుల నిర్మిత సమాజాన్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది. అది మెథడాలాజికల్ ప్రాబ్లెం. సమాజ పరిణామ క్రమాన్ని మార్క్సిస్టు పద్ధతిలో అర్థం చేసుకొనే ప్రయత్నం త్రిపురనేని చేశారు. రాంభట్ల కృష్ణమూర్తి కూడా అదే ప్రయత్నం చేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అన్వర్తింప చేసే కృషి రాంభట్ల కొనసాగించారు. ఆయన వాస్తవికతను పురాణ వాస్తవికత, ప్రబంధ వాస్తవికత, కాల్పనిక వాస్తవికత, సోషలిస్టు వాస్తవికతలుగా అనేక విభజనలు చేశారు. ఆ క్రమంలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నిర్మాణం వెనక ఉత్పత్తి పోషించిన పాత్రను తెలిపారు. ఉత్పత్తి క్రమంలో రూపొందిన సాహిత్యమే వేదాది సాహిత్యమని ఆయన భావించారు. ఈ కాల్పనిక ఆధిపత్యవాద సాహిత్యంలో ఆయన కెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. రామ, రావణ వైరంలో కూడా ఆయనకు వర్గ సంఘర్షణ కనిపించింది. ఇతిహాస, పురాణాల పట్ల ఆయనకు బలమైన విశ్వాసం వుంది. ఆ రచనలను మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతాన్నీ, మార్క్సిస్టు వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు ఉపయుక్తం చేసుకోవటమే వింత. వేదాలు యురేషియా నుండి ఇక్కడికి వచ్చినవి. హరప్పా నాగరికత నాటి మానవులకు వేదాలకు ఎలాంటి సంబంధం లేదు. వైదిక ధర్మం పూర్తిగా విదేశీయమైంది.

యురేషియా సంచార జాతుల దురాక్రమణ వల్ల హరప్పా నాగరికత అంతరించింది. హరప్పా నాగరికతలో వర్గ అసమానతలు లేవు. వారు ఉత్పత్తి సాధనాలను అభివృద్ధి చేయటమే కాదు, శాస్త్రీయమైన జ్ఞానాన్ని కూడా నిర్మించారు. మరి హరప్పా నాగరికత కాలం నాటి పురాణాలేవి? ఇప్పుడు ప్రచలితంగా ప్రచారంలో వున్న పురాణాలకు ఎంత వయస్సు ఉంటుంది? ఇతిహాసాలు ఏ కాలంలో ఆవిర్భవించాయి? ఈ ప్రశ్నలకు మార్క్సి స్టు పద్ధతి సరైన సమాధానం చెప్పదు. ఉత్పత్తి పెరిగినప్పుడే వర్ణ వ్యవస్థ ఏర్పడిందనేది మార్క్సిస్టు అవగాహన. కానీ ఉత్పత్తి ఎక్కువగా జరిగిన హరప్పా నాగరికతలో వర్ణ వ్యవస్థ రూపొందలేదు. అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ యురేషియా సంచార తెగల దురాక్రమణ ఫలితమని బోధపడుతుంది. అష్టాదశ పురాణాలు ప్రతివిప్లవం తర్వాత రూపొందినవి. కుల పురాణాలు కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏర్పడినవి. క్రీ.పూ. 187లో మౌర్య చక్రవర్తి బృహద్రదున్ని హతమార్చిన పుశ్యమిత్రుడు వర్ణ వ్యవస్థను పునరుద్ధరించాడు. మనుధర్మం, భగవద్గీత, మహాభారత, రామాయణాలు, అష్టాదశ పురాణాలు రాయించాడు. అంటే వర్ణ వ్యవస్థను సమర్ధించే రచనలు మూలవాసీ చక్రవర్తి బృహద్రదుని రాజ్యాన్ని బ్రాహ్మణుడైన పుశ్యమిత్రుడు చేజిక్కించుకొన్నాకే జరిగింది.

కానీ, వర్గ సిద్ధాంతం ప్రకారం పైన పేర్కొన్న రచనలన్నీ సమాజం తనకు తానే ఉత్పత్తి క్రమంలో కల్పించుకొన్నవి. అందుకే వాటిలో మార్క్సిస్టులు అనుకూల అంశాలను మాత్రమే చూడగలిగారు. కుల వ్యవస్థ పరిణామాన్ని సూత్రీకరించడానికి చారిత్రక భౌతికవాదం సరిపోదు. అది వర్గ ప్రాతిపదికన మాత్రమే సమాజాన్ని వ్యాఖ్యానించగలదు. సుమారు వేయి సంవత్సరాల పాటు ఉనికిలో వున్న బౌద్ధ రాజ్యాలలో ఎలాంటి సాహిత్యం ఉందో తెలుసుకొనే ప్రయత్నం మార్క్సిస్టు సాహిత్యకారులు చేయలేదు. వేద కాలంలోని రచనలను విశ్లేషించి, ఆ వెంటనే ప్రబంధ కాలానికి వెళ్లిపోయే ఒక పలాయన వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. బౌద్ధ రాజ్యాల్లో విలసిల్లిన సాహిత్య, సాంస్కృతిక, కళా సిద్ధాంతాలను గానీ, విద్యా, వైజ్ఞానిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని గానీ ఏ మాత్రం ప్రస్తావించరు. అంటే, బ్రాహ్మణవాద చరిత్రకారులు ఏ ఆకరాలను ప్రామాణికమని సమాజం మీద రుద్దారో వాటిని మాత్రమే గ్రహిస్తే సమాజ పరిణామ క్రమం సవ్యంగా ఎలా అర్థం అవుతుంది? చారిత్రక భౌతికవాదం పేరుతో బ్రాహ్మణీయ చరిత్ర రాజ్యమేలింది. ఇయంఎస్ నంబూద్రిపాద్ రాసిన 'వేద భూమి' అందుకు నిదర్శనం. వాస్తవికవాదం బ్రాహ్మణవాదానికి మరో పేరుగా మారిపోవటమే విచారం. యూరోప్ సమాజంలో అది సాధించిన ఘన విషయాలు ఇక్కడ సాధించలేకపోవడానికి అది వక్రీకరణకు గురికావటమే కారణం.

వాస్తవికవాదం పేరుతో చలామణి అయిన సాహిత్య ఆధిపత్యానికి ప్రతిస్పందనగా వచ్చిందే 'ప్రతివాస్తవికవాదం' (కౌంటర్ రియలిజం). కులం ఒక వాస్తవం. అస్పృశ్య రచయితలు సాహిత్యంలో కుల వ్యవస్థ స్వరూప, స్వభావాలను చిత్రించిన తీరు, కులం ఒక అధికార వ్యవస్థగా ప్రజల జీవితాలను శాసించే సామాజిక నియతిని కళాత్మకంగా రూపుగట్టిన తీరును పఠించే ఒక పద్ధతే ప్రతివాస్తవికవాదం. అదొక పఠన పద్ధతి మాత్రమే కాదు. ప్రాపంచిక దృక్పథం కూడా. ప్రతివాస్తవికతను అర్థం చేసుకొనేందుకు అంబేద్కరిజం వెలుగులో కుల వాస్తవికతను అర్థం చేసుకోవాల్సిందే. బ్రాహ్మణ ధర్మంలోని కుల అంతర్వుల నియమాన్నీ, కులం పేరుతో కొనసాగుతున్న దాస్యాన్ని చిత్రించటమే సాహిత్యంలో ప్రతివాస్తవికత. కుల వ్యవస్థలో బానిస కులాల రచయితలు సమాజ పరివర్తన కోసం సృజించిన రచనలన్నీ ప్రతివాస్తవికత పరిధిలోకి వస్తాయి. కులం పేరుదో చీల్చబడిన మూలవాసుల కళా సృజనకు, బ్రాహ్మణవాదుల కళా దృష్టికీ మధ్య చాలా వైరుధ్యం తప్పకుండా వుంటుంది. అందుకే ప్రతివాస్తవికవాదం కళాతత్వానికి సంబంధించింది కూడా. పరావర్తన సిద్ధాంతంతో పీడిత కులాల నిజమైన జ్ఞాన సిద్ధాంతానికి సంధి కుదరదు. మసక బారిన పరావర్తన అద్దం సత్య రూపాన్ని ప్రతిఫలించదు. బ్రాహ్మణీయ జ్ఞాన సిద్ధాంత పద్ధతిలో చరిత్ర సమాలోచన చేస్తే సత్యం బోధ పడదు. మూడు దశాబ్దాల కింద అలవాటైన వాస్తవికతను పట్టుకొని వేళ్లాడే మూసవాదులకు ఈ కొత్త జ్ఞాన సిద్ధాంతం చికాకునూ చిరాకునూ కల్గిస్తుంది. అయినా సరే, సత్యాన్ని సత్యంగా చెప్పమని కదా అంబేద్కర్ బోధించింది!

- డా.జిలుకర శ్రీనివాస్
jilukara@gmail.com